![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ ఫినాలేకి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక విన్నర్ ఎవరో తెలియాలంటే శుక్రవారం రాత్రి పన్నెండు వరకు పడిన ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉంటే వారే విజేత అని బిగ్ బాస్ అఫీషియల్ గా చెప్పగా.. హౌస్ లో కుర్రాళ్ళున్నా ఒక యాభై సంవత్సరాల శివాజీ వారితో పోట పోటీగా గేమ్స్ ఆడుతూ చాణక్యుడిలా మైండ్ గేమ్ ఆడుతూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ బిగ్ వాస్ కంటెస్టెంట్ గా శివాజీ రికార్డులు సృష్టిస్తున్నాడు. నిన్నటి జరిగిన ఫుడ్ కి సంబంధించిన టాస్క్ లో కూడా అయిదు నిమిషాలో అన్ని బెలూన్స్ ని పగులగొట్టి విజయం సాధించి.. వహ్వా అనిపించాడు.
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తెలియడానికి మరో అడుగు దూరమే ఉంది. ఈ అవకాశం ఉన్న వారిలో శివాజీ ఒకడు. శివాజీ సినిమా హీరోగా ఉన్నప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలుసు. అయితే బిగ్బాస్ హౌస్లోకి రావడం మాత్రం శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన శివాజీ ప్రస్తుతం టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. నిజానికి ఫ్యామిలీ వీక్ వరకు శివాజీనే హాట్ ఫేవరేట్ ఉన్నాడు. ఆ వీక్లో తన పెద్ద కొడుకు వెంకట్ హౌస్లోకి వచ్చినప్పుడు శివాజీ ఎమోషనల్ అవ్వడంతో ఆడియన్స్కి శివాజీ మరింత కనెక్ట్ అయ్యాడు. తండ్రి, కొడుకుల మధ్య ఉన్న ఆ బాండింగ్ను అందరికి గుర్తు చేసి మరింత ఎమోషనల్ చేసాడు బిగ్ బాస్. అయితే ఫ్యామిలీ వీక్ ఈ సారి పదవ వారంలోనే జరిగింది. ఇక హౌస్ లో అందరితో మంచి రాపో ఉంది కేవలం శివాజీకే అని జర్నీ వీడియోలో స్పష్టత వచ్చేసింది. చాణక్యుడిగా, పల్లవి ప్రశాంత్, యావర్ లకి గురువుగా ఎంతో మంది అభిమానాన్ని పొందాడు శివాజీ. దీంతో అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో శివాజీ ఉన్నాడు.
అమర్ దీప్ టైటిల్ రేస్ నుండి తప్పుకున్నట్టే ఎందుకంటే గతవారం ముందు వరకు మూడవ స్థానంలో ఉన్న అమర్ దీప్.. పద్నాలుగవ వారంలో ప్రశాంత్తో బిహేవియర్ చూసి ఆడియన్స్ షాకయ్యారు. ప్రశాంత్ను కొరకడం, తోసేయడం, తోసుకుంటూ రూడ్గా బిహేవ్ చేయడంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువైంది. అంతకుముందు వరకు ఫౌల్ గేమ్స్ తో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించిన అమర్ దీప్.. ప్రియాంక, శోభాల సపోర్ట్ తో ఇన్నివారాలు ఉన్నాడనేది వాస్తవం. గత ఆరు వారాలుగా దత్తపుత్రిక శోభాశెట్టిని కాపాడిన బిగ్ బాస్. ఇక రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. గ్రామాల నుండి అత్యధిక ఓట్లు వస్తున్నా.. శివాజీని బీట్ చేయలేకపోతున్నాడు ప్రశాంత్. ఇక ప్రియాంక, అర్జున్ బాటమ్-2 లో ఉన్నారు. హౌస్ లో ఆరుగురి జర్నీ వీడియోలలో బాగా పాపులర్ అయిన ఎక్కువ మందికి నచ్చేసిన జర్నీలు.. శివాజీ, యావర్, ప్రశాంత్ ల జర్నీ వీడియోలే. వీరి జర్నీ లలో ఒక కష్టం, ఆనందం, గెలవాలనే కసి, ఫెయిర్ ప్లే, లౌఖ్యం.. ఇలా తెలిసి తప్పు చేయకూడదు. ఒకవేళ తెలియకుండా చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని యావర్, శివాజీ, ప్రశాంత్ ముగ్గురు నిరూపించారు. అందుకే జనాలు వీరికి పట్టం కట్టారు. అయితే ప్రస్తుతం ఉన్న ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య గట్టి పోటీ జరుగుతుంది. ఓటింగ్ లో వీరే టాప్ లో ఉన్నారు. మరి విన్నర్ ఎవరవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు అగాల్సిందే.
![]() |
![]() |